రామాయణము
ఉత్తరకాండ - నలుబదిరెండవసర్గ
ధర్మజ్ఞుడైన రామచంద్ర ప్రభువు నిత్యము రాజధర్మ కార్యములను ధర్మమార్గమున ఓనర్చుచుండెడివాడు . సీతాదేవికూడా దేవకార్యములను చేయుచూ అత్తలందరికీ సంతోషకరంగా విశిష్టారీతిలో సేవలు చేసెడిది . ఆ విధముగా సీతారాములు ఇరువురు రాజార్హమైన వివిధ భోగములను అనుభవించుచూ పదివేల సంవత్సరములు గడిపిరి . పిమ్మట ఒకరోజు శ్రీ రాముడు సీతాదేవితో " వైదేహీ ! నీలో గర్భవతి చిహ్నములు కనిపించుచున్నవి . నీకోరిక ఏమి అని అడిగెను . అప్పుడు సీతాదేవి చిరునవ్వులు నవ్వుతూ " రఘువీరా ! పవిత్రములైన తపోవనములను దర్శించుటకు ఋషీశ్వరులయొక్క పాదములను సేవించుటకు వేడుకపడుచున్నాను . ఆ మునుల యొక్క తపోవనములయందు నివసింప దలుచుచున్నాను . ఇదే నా ప్రబలమైన కోరిక . అప్పుడు శ్రీ రాముడు " నీవు రేపే తపోవనములకు వెళ్లగలవు " అని సీతాదేవికి మాట ఇచ్చెను .
రామాయణము ఉత్తరకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు .
No comments:
Post a Comment