రామాయణము
యుద్ధకాండ ---------నూటఇరువదిఆరవసర్గ
శ్రీ రాముడి అనుమతితో ఆ పుష్పకవిమానము ఆకాశములోకి లోకి లేచి ఎగురసాగెను . అప్పుడు శ్రీ రాముడు భూమివాయిపు కిందకు చూస్తూ సీతాదేవితో " జానకి ఇదుగో త్రికూటపర్వతముపై కల ఈ లంకా నగరమును చూడుము . దీనిని విశ్వకర్మ నిర్మించాడు . దానిపక్కనే ఉన్న మాంసకాండములతో , రక్తముతో తడిసిఉన్న ఈ యుద్దభూమినిచూడు . ఇక్కడే అనేకమంది వానర వీరులు రాక్షస యోధులు చంపబడ్డారు . ఇక్కడే బ్రహ్మచేత వారములు పొంది వర గర్వితుడైన రావణుడు కూడా మరణించి భాదిదై పది ఉన్నాడు చూడుము . రావణుని సోదరుడు కుంభకర్ణుణ్ణి కూడా ఇక్కడే నేను చంపాను . లక్ష్మణుడు రావణుడికుమారుడగు ఇంద్రజిత్తునుకూడా ఇక్కడే వధించాడు . సుందరీ ! మానముఁదాటుతున్నసముద్రమును చూడుము . దానిపై కనిపించుచున్న సేతువుని నీకొరకు మేమేనిర్మించితిమి . అదిగో అక్కడ కనపడుచున్న పంపాతీరమును చూడుము . ఇదిచాలా రామణీయప్రదేశము . దాని పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతసమును చూడుము . ఇక్కడే నేను సుగ్రీవుడు మిత్రులమైనాము . సీతా అదిగో చిత్రవిచిత్రములైన వనములతో కనిపించే ఆ నగరమే కిష్కింద . మం వానర రాజు సుగ్రీవుని రాజ్యము ఇది . అని " శ్రీ రాముడు పలుకగా అప్పుడు సీతాదేవి రామునితో స్వామి సుగ్రీవుడి పోషణలో ఉన్నటువంటి తార , రుమా అంతఃపుర స్త్రీలందరితో కలసి మనరాజ్యమునకు వెళ్లవలెనని నా కోరిక . " అని పలికెను .
అప్పుడు శ్రీ రాముడు అట్లే కానిమ్ము అనిపలికి విమానమును కిందకు దింపి సుగ్రీవునితో " వానరోత్తమా ! మేకపివీరులందరు మీమీ భార్యలను తీసుకొనిరండు . వారిని కూడా అయోధ్యకు తీసుకు వెళ్ళెదము . " అనిపలికెను . శ్రీ రాముడు ఇలా పలికిన వెంటనే సుగ్రీవుడు ఇంకాకొంతమంది వానరవీరులు గబగబ కిష్కిందానగరములోనికి ప్రవేశించిరి . పిమ్మట సుగ్రీవుడు అంతఃపురములోకి వెళ్లి తారతో " తారా ! మిగిలిన వానరపత్నులతోపాటుగా నీవు అయోధ్యానగరమును దర్శించుటకు శ్రీ రాముడు అనుమతిని ఇచ్చెను కావున మీరందరు వెనువెంటనే తయారులై నాతోరాదు అని పలికెను .
అప్పుడు తార సుగ్రీవుడి మాటలు విన్నంతనే అక్కడి వానర స్త్రీలందరిని పిలిచి " మనమందరము సమస్తవనరులతో కలిసి అయోధ్యకు వెళ్ళుటకు సుగ్రీవ మహారాజు అజ్ఞ్యాపించినాడు . కావున మీరందరు వెనువెంటనే ప్రయాణమునకు సిద్దముకండి . నేను కూడా అయోధ్యానగరమును చూడాలనుకొంటున్నాను . పురజనులతో కలిసి శ్రీ రామ ప్రభువు అయోధ్యా నగరములో అడుగు పెట్టేదృశ్యమును అక్కడి అంతఃపుర స్త్రీ లను మనము దర్శించుకొని వద్దాము . " అని పలికెను . తార ఆలా పలికిన వెంటనే అక్కడి స్త్రీలందరు మిక్కిలి వేగంగా తయారై విమానమువద్దకు వెళ్లిరి . పిదపేవారు ఆ విమానమునకు ప్రదక్షిణచేసి సీతాదేవిని చూడవలననే తొండరలో గబగబా ఆ విమానమును ఎక్కిరి పిదప రాముడి ఆజ్ఞతో ఆ విమానము మళ్ళీ ఆకాశమువైపు ఎగిరి అయోద్యవైపుగా దూసుకు పోసాగెను . అప్పుడు దారిలో వచ్చు ప్రదేశములను చూస్తూ శ్రీరాముడు సీతా దేవితో సీతా అదిగో పంచవటిలో మనము నివసించిన ఆ కుటీరమును నీయవు గుర్తుపట్టితివా సీతా అదిగో అగస్త్యమహాముని ఆశ్రమము వచ్చుచున్నది చూడు , ఇదిగో ఈ పక్క శరభంగ మహాముని ఆశ్రముని చూడు , అత్రిమహర్షిని మనము దర్శనము చేసుకొన్నది అదిగోఅక్కడే . అదిగో చిత్రకూట పర్వతము మనము ఇక్కడ వున్నప్పుడే భరతుడు మానవద్దకు వచ్చి మనల్ని తిరిగి రాజ్యమునకు రమ్మని ప్రార్ధించినందు కదా అదిగో దూరముగాకనబడుచున్నది భారద్వాజాశ్రమము . దాని తదుపరి కానవచ్చునది శృంగిభేరి పురము . దాను ఆవలి కనపడుచున్నది చూసావా అదే మన రాజ్యము అయోధ్యా అని పలికెను . శ్రీ రాముడు ఈవిధముగా చెప్పుచున్నప్పుడు . వానర , వీరులందరు విమానము నుండి ఆసక్తిగా కిందకు చూచుచుండిరి .
రామాయణము ------------యుద్ధకాండ-----------నూటఇరువదిఆరవ సర్గ -----------సమాప్తము
శశి ,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment