రామాయణము
ఉత్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ
తన సైన్యము నశించారని తెలుసుకున్న యమధర్మ రాజు తానే స్వయముగా యుద్ధమునకు సిద్దపడెను . మృత్యు దేవత పాశమును, గదను చేబూచి, యమునిముందుభాగమున నిలిచెను . యముని ఆయుధ మైన కాల దండము మనిషిగా మారి యముని ప్రక్కన నిలిచెను . తాకినంతనే భగ్గుమనే గద కూడా వ్యక్తిగా మారి పక్కన నిలిచెను . యముడు క్రుద్ధుడై ఉండుట చూసి ముల్లోకములు దేవతలు భయముతో కంపించిపోయిరి .
ఆ విధముగా యమధర్మ రాజు క్షణకాలంలో యుద్దభూమికి చేరెను . మృత్యు దేవతతో కలిసి యుద్ధసన్నాహములతో భీకరముగా ఉన్న యముడిని చూసి రావణుని మంత్రులు " శక్తివంతములైన యముని బలముల ముందు మన బలములు నిలువచాలవు . వీరి తో యుద్ధము చేయుటకు మనము అసమర్థులము . " అని పలికి అను దిక్కులా పారిపోయెను . రావణుడు ఏమాత్రము భయపడలేదు . యముడు రావణుడిని సమీపించి తన ఆయుధములతో అతడి ఆయువు పట్టులపై కొట్టెను . రావణుడు యముని రథముపై సరవర్షము కురిపించెను . యముడు వివిధ ఆయుధములను చేతబూని ప్రయోగించుచు వరుసగా ఏడురోజులు యుద్ధము చెసెను . యముడి ధాటికి తట్టుకోలేక రావణుడు దిక్కు తోచని వాడయ్యెను . పిదప యముడు తన కాల దండముతో రావణుణ్ణి కొట్టుటకై యత్నించెను . అప్పుడు బ్రహ్మదేవుడు యముడికి మాత్రమే కనబడి " యమధర్మారాజా! నీ పరాక్రమము అద్భుతము . నీవు ఈ కాలదండముతో ఈ రావణుడిని చంపవలదు . దేవతలలో శ్రేష్ఠుడివైన యమధర్మరాజా ! నేను ఇతడికి దేవతల వలన మరణము లేకుండునట్లు వరము ప్రసాదించితిని . నీవు ఇతడిని సంహరించినచో నేను అసత్య వాదిని అగుదును . అని పలికెను . అప్పుడు యముడు " స్వామీ! నీవు మా అందరికి ప్రభువువు . నీ మాట మాకు శిరోధార్యము . కావున కాల దండమును ఉపసంహరించుకుంటున్నాను . కనుక నేను ఇతడికి కనబడకుండా రధముతో సహా అదృశ్యుడిని అయ్యేదను . " అని పలికి యముడు అదృష్యుడుఅయ్యెను . అప్పుడు దశగ్రీవుడు తాను యముడిని జయించినట్లుగా ప్రకటించుఁకొనెను . పిమ్మట అతడు పుష్పక విమానము ఎక్కి యమలోకమునుండి వెళ్లిపోయెను . అనంతరము ఉర్మాధర్మరాజు బ్రహ్మదేవునితో సహా స్వర్గలోకమునకు చేరెను . నారదుడు కూడా తన దారిన తాను పోయెను .
రామాయణము ---------ఉత్త్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ ----------సమాప్తము .
శశి
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment