రామాయణము
ఉత్తరకాండ --------పదకొండవసర్గ
దశగ్రీవుడు , కుంభకర్ణుడు,విభీషణుడు బ్రహ్మ వలన వరములు పొందిన విషయము సుమాలి కి తెలిసెను . అప్పుడు అతడు భయమును వీడి పాతాళలోకమునుండి తన అనుచరులతో సహా బయటకు వచ్చెను . సుమాలి తనతో పాటుగా తన మంత్రులైన మారీచుడు , ప్రహస్తుడు, విరూపాక్షుడు , మహోదరుడు అనే వారిని కూడా తీసుకువచ్చెను . పిమ్మట అతడు దశగ్రీవుని కడకు చేరి అతడిని అక్కున చేర్చుకొని అతడితో " నాయనా ! దశగ్రీవ! ముల్లోకములలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుని నుండి వరములు పొందితివి . మేమందరము విష్ణు మూర్తికి భయపడి పాతాళలోకములో తలదాచుకొంటిమి . మాకు ఆ భయము ఇప్పుడు తొలగి పోయింది . వాస్తవముగా ఆ లంక మనది నీసోదరుడగు వైశ్రవణుడు అందు నివసించుచున్నారు . మనము ఇప్పుడు సామదానోపాయములచేకాని లేక బలప్రయోగముచే కానీ దాన్ని తిరిగి పొందవలెను . లంక మనకు వశమైనచో నీవే రాజువి , మా అందరికి ప్రభువు వి " అని పలికెను . తన వద్దకు వచ్చి , ఈవిధముగా పలుకుతున్న తాత (తల్లికి తండ్రి ) తో " తాతా! ఆ ధనాధిపతి మాకు అగ్రజుడు . అతని గురించి నీవు ఈ విధముగా మాట్లాడడము తగదు . " అని పలికి తన తండ్రివద్దకు వెళ్లి పోయెను . కొంత కాలము తర్వాత ప్రహస్తుడు రావణుని సమీపించి " దశగ్రీవా నీవు ఆవిధముగా పలకటం తగదు . సురులకు సోదరభావం పట్టదు . కనుక నా మాటలు వినుము .
అదితి , దితి అను వారు అక్కాచెల్లెళ్లు వారిరువురు పరస్పర అనురాగము కలవారు . , మిక్కిలి సౌందర్యవంతులు . వారిరువురు కశ్యప ప్రజాపతికి భార్యలు . అతిధి దేవతలకు జన్మనిచ్చెను . దితి దైత్యులకు జన్మనిచ్చెను . వనములతో , సముద్రములతో, పర్వతములతో కూడి ఉన్న ఈ లంకా నగర ప్రదేశమంతా దైత్యులదే . విష్ణువు రాన రంగమున హతమార్చెను . అప్పుడు దేవతలకు శాశ్వతముగా ముల్లోకములు ప్రాప్తించెను . సోదరులతో పోరు సల్పుట అను అంది నీకు విపరీతకార్యముగా అని పించవచ్చు . కానీ ఈ కార్యమును నీవు మాత్రమే చేయబోవుటలేదు . అన్న దమ్ములైన సురాసురులు ఇంతకు ముందే ఇట్టి పోరుసల్పి యుండిరి . కనుక నా మాటలను పాటించుము . " అని పలికెను . ప్రహస్తుడి మాటలకు దశగ్రీవుడు క్షణకాలం పాటు అలోచించి సంతోషముతో పొంగిపోయి అట్లే అని తన సమ్మతిని తెల్పెను . పిమ్మట అతడు తన అనుచరులతో కలిసి త్రికూట పర్వతమునకు చేరి ప్రహస్తుడిని దూతగా పంపెను .
ప్రహస్తుడు కుభేరుడి పాలనలో ఉన్న లంకలో అడుగిడి ఆ ధనాధిపతితో " ధర్మాత్మా ! నీ సోదరుడైన దశగ్రీవుడు పంపగా నీవద్దకు వచ్చితిని . విశాలాక్ష ! పూర్వము రమ్యమైన ఈ లంకా పురమును సుమాలి మున్నగు రాక్షస ప్రముఖులు పరిపాలించెడివారు . కనుక తిరిగి ఈ లంకా నగరమును మాకు ఇచ్చివేయుము .అని తనమాటగా దశగ్రీవుడు నీకు తెల్పమన్నాడు . ఆ మాటలు విన్న వైశ్రవణుడు " ప్రహస్త ! రాక్షసులు వదిలి వెళ్లిన పిమ్మట చాలా కాలము ఈ లంక కాలియగానే ఉన్నది అప్పుడు మా తడ్రిగారగు విశ్రవసుడు ఈ నగరమును నాకు అప్పగించెను . పిమ్మట నా ప్రజలైన యక్షులను ఇందు నివసింప చేసితిని . నా పరిపాలనలో ఉన్న ఈ నగరము మా తమ్ముడిది కూడా కావున హాయిగా తనను నాతో కలిసి ఇక్కడ ఉండ మను " అని పలికెను .
ఆ దూతతో ఈ విధముగా పలికి అతడిని పంపించిన తరువాత తన తండ్రి వద్దకు వెళ్లి తన తండ్రితో రావణుడి కోరికను తెల్పెను . అప్పుడు ఆయన కుభేరునితో " కుమారా ! దశగ్రీవుడు నా వద్ద ఈ విషయములను ఐదు వరకే ప్రస్తావంచినాడు . ఆ దుర్మతికి నేనెంతో నచ చెప్పను మిక్కిలి మందలించితిని కూడా నీవి ఇలా చేసినచో తప్పక పథాన మవుతావు అని కోపంతో పదే పదే హెచ్చరించితిని . భళా గర్వితుడైన ఆదుష్టుడు యుక్తాయుక్తములను ఎరుగడు అందువలన నీవు నీ సహచరులతో కలిసి లంకను వదిలి కైలాస పర్వతమునకు వెళ్లి అక్కడ నివసింపుము నీకు ఆ రాక్షసునితో వైరము ఏమాత్రము తగదు అతడు బ్రహ్మ నుండి పొందిన వరములు గురించి నీకును తెలియును కదా " అని పలికెను . తండ్రి మాటలు విన్న వైశ్రవణుడు ఆయన మాటలు పాటించి భార్య పుత్రులతో అమాత్యులతో , ధన , వస్తు వాహనములతో వెంటనే లంకను వీడి కైలాసమునకు చేరెను . పిమ్మట దశగ్రీవుడు తనసోదరులతో అనుచరులతో కలిసి లంకా నగరములో ప్రవేశించెను , దశాననుడు లంకా నగరమునకు పట్టాభిషిక్తుడై వైభవోపేతముగా నివసింపసాగెను . ఆ లంక నగరము రాక్షస గణములతో నిండిపోయినది . ఖుభేరుడు తండ్రిమాట పై గల గౌరవముతో కైలాసగిరి యందలి అలకా పురిలో నివసించసాగిరి .
అదితి , దితి అను వారు అక్కాచెల్లెళ్లు వారిరువురు పరస్పర అనురాగము కలవారు . , మిక్కిలి సౌందర్యవంతులు . వారిరువురు కశ్యప ప్రజాపతికి భార్యలు . అతిధి దేవతలకు జన్మనిచ్చెను . దితి దైత్యులకు జన్మనిచ్చెను . వనములతో , సముద్రములతో, పర్వతములతో కూడి ఉన్న ఈ లంకా నగర ప్రదేశమంతా దైత్యులదే . విష్ణువు రాన రంగమున హతమార్చెను . అప్పుడు దేవతలకు శాశ్వతముగా ముల్లోకములు ప్రాప్తించెను . సోదరులతో పోరు సల్పుట అను అంది నీకు విపరీతకార్యముగా అని పించవచ్చు . కానీ ఈ కార్యమును నీవు మాత్రమే చేయబోవుటలేదు . అన్న దమ్ములైన సురాసురులు ఇంతకు ముందే ఇట్టి పోరుసల్పి యుండిరి . కనుక నా మాటలను పాటించుము . " అని పలికెను . ప్రహస్తుడి మాటలకు దశగ్రీవుడు క్షణకాలం పాటు అలోచించి సంతోషముతో పొంగిపోయి అట్లే అని తన సమ్మతిని తెల్పెను . పిమ్మట అతడు తన అనుచరులతో కలిసి త్రికూట పర్వతమునకు చేరి ప్రహస్తుడిని దూతగా పంపెను .
ప్రహస్తుడు కుభేరుడి పాలనలో ఉన్న లంకలో అడుగిడి ఆ ధనాధిపతితో " ధర్మాత్మా ! నీ సోదరుడైన దశగ్రీవుడు పంపగా నీవద్దకు వచ్చితిని . విశాలాక్ష ! పూర్వము రమ్యమైన ఈ లంకా పురమును సుమాలి మున్నగు రాక్షస ప్రముఖులు పరిపాలించెడివారు . కనుక తిరిగి ఈ లంకా నగరమును మాకు ఇచ్చివేయుము .అని తనమాటగా దశగ్రీవుడు నీకు తెల్పమన్నాడు . ఆ మాటలు విన్న వైశ్రవణుడు " ప్రహస్త ! రాక్షసులు వదిలి వెళ్లిన పిమ్మట చాలా కాలము ఈ లంక కాలియగానే ఉన్నది అప్పుడు మా తడ్రిగారగు విశ్రవసుడు ఈ నగరమును నాకు అప్పగించెను . పిమ్మట నా ప్రజలైన యక్షులను ఇందు నివసింప చేసితిని . నా పరిపాలనలో ఉన్న ఈ నగరము మా తమ్ముడిది కూడా కావున హాయిగా తనను నాతో కలిసి ఇక్కడ ఉండ మను " అని పలికెను .
ఆ దూతతో ఈ విధముగా పలికి అతడిని పంపించిన తరువాత తన తండ్రి వద్దకు వెళ్లి తన తండ్రితో రావణుడి కోరికను తెల్పెను . అప్పుడు ఆయన కుభేరునితో " కుమారా ! దశగ్రీవుడు నా వద్ద ఈ విషయములను ఐదు వరకే ప్రస్తావంచినాడు . ఆ దుర్మతికి నేనెంతో నచ చెప్పను మిక్కిలి మందలించితిని కూడా నీవి ఇలా చేసినచో తప్పక పథాన మవుతావు అని కోపంతో పదే పదే హెచ్చరించితిని . భళా గర్వితుడైన ఆదుష్టుడు యుక్తాయుక్తములను ఎరుగడు అందువలన నీవు నీ సహచరులతో కలిసి లంకను వదిలి కైలాస పర్వతమునకు వెళ్లి అక్కడ నివసింపుము నీకు ఆ రాక్షసునితో వైరము ఏమాత్రము తగదు అతడు బ్రహ్మ నుండి పొందిన వరములు గురించి నీకును తెలియును కదా " అని పలికెను . తండ్రి మాటలు విన్న వైశ్రవణుడు ఆయన మాటలు పాటించి భార్య పుత్రులతో అమాత్యులతో , ధన , వస్తు వాహనములతో వెంటనే లంకను వీడి కైలాసమునకు చేరెను . పిమ్మట దశగ్రీవుడు తనసోదరులతో అనుచరులతో కలిసి లంకా నగరములో ప్రవేశించెను , దశాననుడు లంకా నగరమునకు పట్టాభిషిక్తుడై వైభవోపేతముగా నివసింపసాగెను . ఆ లంక నగరము రాక్షస గణములతో నిండిపోయినది . ఖుభేరుడు తండ్రిమాట పై గల గౌరవముతో కైలాసగిరి యందలి అలకా పురిలో నివసించసాగిరి .
రామాయణము --------ఉత్తరకాండ -------పదకొండవసర్గ ----------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment